Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఘట్కేసర్ రూరల్
కృషి, పట్టుదలతో ముందుకెళ్లినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని అనురాగ్ విద్యా సంస్థల డైరెక్టర్ కె.ఎస్.రావు విద్యార్థులకు సూచించారు. 2019 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించే రిపబ్లిక్ పేరేడ్కు ఎంపికైన ఘట్కేసర్ మండలం వెంకటాపూర్కు చెందిన చరణ్ తేజ్ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థుల్లో సాధించాలనే తపన ఉన్నప్పడే విజయం సొంతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ హెచ్ఓడీ వెంకట్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ చెన్న కేశవ మల్లేష్, ఇతర సిబ్బంది నవీన్, రసూల్, చిన్న శ్రీనివాస్ పాల్గొన్నారు