Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఘట్కేసర్
టీఆర్ఎస్ పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసే అర్హత మలిపెద్ది సుధీర్రెడ్డికి లేదని ఎంపీటీసీలు నర్రి శ్రీశైలం, బాషగళ్ల సంజరు, నాయకులు మిసాల మల్లేశ్లు అన్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశామని తెలిపారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని బడుగు వర్గాల నాయకులను, కార్యకర్తలను పట్టించుకోలేదుకానీ, ఇప్పుడు ఎలా మమ్మల్ని సస్పెండ్ చేస్తారనీ ప్రశ్నించారు. తన స్వలాభం కోసం ఇతర పార్టీల వారికి, తన సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ప్రధాన్యత ఇచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యేగా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్కు మద్దతు ఇచ్చారని ఆరోపించారు.