Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి
- రీకౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారికి వినతి
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
సీఈవో రజత్కుమార్ను ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి శుక్రవారం కలిశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, కావాలనే తన ఓట్లను లెక్కించలేదని అన్నారు. 18వ రౌండ్ నుంచి తన మెజార్టీ తగ్గించారని మల్రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడు సెల్ఫోన్తో కౌంటింగ్ హాల్కు వచ్చారన్నారు. దీంతో కేటీఆర్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి నడుచుకున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్ న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని మల్రెడ్డి స్పష్టం చేశారు. కౌంటింగ్లో అన్యాయం జరిగిన అభ్యర్థులతో కలసి పోరాటం చేస్తానన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయాలని రజత్కుమార్ను మల్రెడ్డి రంగారెడ్డి కోరారు.