Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా రవాణా అధికారి వాణి
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
వికారాబాద్ జిల్లాలోని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇక నుంచి తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా అధికారి ఎన్.వాణి అన్నారు. ఈ నెల 24 నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనల విషయమై ఈ నెల 24 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వాహనదారులు ఇక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు తన వంతు కర్తవ్యంగా ప్రమాదంలో ఉన్న వారిని వెంటనే ఆస్ప త్రికి చేర్పించాలన్నారు. పరిమితికి మించి వేగంగా వెళ్తే 400 జరి మానా విధిస్తామన్నారు. తాగి వాహనం నడపడం వల్లా ప్రమా దాలు జరుగుతున్నాయని తాగిన వ్యక్తులు బండి నడుప వద్దని కోరారు. ప్రతి బండికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని డ్రైవింగ్ లైసన్స్ లేకుండా బండి నడిపితే జప్తు చేస్తామన్నారు.