Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీ
నవతెలంగాణ-బోడుప్పల్
నేడు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునే విధంగా తమ సంస్థ వాహనాలను తయారు చేస్తోందని అశోక్ లే లాండ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్(ఆటోమోటివ్ మాన్యూఫాక్ఛరర్స్) రాజీవ్ సంఘ్వీ అన్నారు. ఉప్పల్ డిపో వద్ద శుక్రవారం ఆశోక్ లే లాండ్ సంస్థ వారి ట్రక్ 4123 ప్రదర్శన శాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము వినియోగదారుల కోరికలను జాగ్రత్తగా పరిశీలించడంతోపాటు తమ నెట్వర్క్ను స్థిరంగా విస్తరించుకుంటున్నామన్నారు.
ఆటో మోటివ్ మాన్యుఫాక్చరర్స్ ప్రయివేటు లిమిటెడ్ (ఏఎంపీఎల్) వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు ద్వారా తమ విస్తృత శ్రేణి వాహనాలను ప్రదర్శిస్తున్నామన్నారు. వీటిలో వాణిజ్య వాహనాలు (ఐసీవీలు) టిప్పర్లు, హౌలేజ్ ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తం శ్రేణి ఉత్పత్తులు నిరూపించబడిన ఐ ఈజీఆర్(ఇంటలిజెంట్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్య్కూలేషన్) టెక్నాలజీని బీస్-4 ఇంజన్ల కోసం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లోకి తీసుకొచ్చిన 16 టైర్ల వాహనం ద్వారా వినియోగదారులకు, వాహన దారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అనేక మంది వినియోగదారులు ప్రదర్శనను తిలకించారు.