Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 1,26,811 మంది ఓటర్లు
- గ్రామ పంచాయతీలు 61, వార్డులు 594
- రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు
నవతెలంగాణ- మేడ్చల్ కలెక్టరేట్
గ్రామ పంచాయతీలు 61, వార్డులు 594
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా పంచాయతీ అధికారులు ఇప్పటికే తలమునకలవు తున్నారు. జిల్లాలో మొత్తం 1,26,811 మంది ఓటర్లు, అందులో 66072 పురుషులు, 60739 మహిళా ఓటర్లున్నారు. ఎస్టీ ఓటర్లు 4,627, ఎస్సీలు 20,558, బీసీలు 70,566, ఇతర ఓటర్లు 31,050 మంది ఉన్నట్టు జిల్లా పంచాయతీ శాఖ అధికారులు లెక్క తెల్చారు. కీసర మండల పరిధిలో 11 గ్రామ పంచాయతీల్లో 106 వార్డులు, 20,036 ఓటర్లు ఉన్నారు. ఘట్కేసర్ మండలంలోని 11 గ్రావ ుపంచాయతీల్లో 114 వార్డులు, 29,551 ఓటర్లు ఉన్నారు. మేడ్చల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో 160 వార్డులు, 28,328 ఓటర్లు. శామీర్పేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో 216 వార్డులు, 45,701 ఓటర్లు ఉన్నారు.
గ్రామాల్లో గ్రామసభలు
గత ఆదివారం విడుదల చేసిన బీసీ ఓటర్ల ముసాయిదా జాబితా అనంతరం మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖా స్తులను అధికారులను పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. జిల్లాలోని నాలుగు మండలాల్లో గ్రామ సభలు పూర్తిచేసి ఈ నెల 15న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు.
రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు
సర్పంచుల పదవీ కాలం ఆగస్టు 2తో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. సర్పంచుల పదవీ కాలం ముగిసే నెలముందే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ రిజర్వేషన్లపై చోటు చేసుకున్న పరిణామాలు హైకోర్టు వరకు తీసుకెళ్లాయి. దాంతో 2019 జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వ హించాలని హైకోర్టు ఆదేశించింది. సర్పంచ్ పదవి కోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముం దుకు రావడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెల కొంది. 50 శాతానికి మించరాదనే సుప్రీం కోర్టు ఆదేశాలను అను సరించి రిజర్వేషన్లు ప్రకటిం చాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
రాజకీయ హడావిడి
పంచాయతీ ఎన్నికల కార్యచరణను యంత్రాంగం వేగవంతం చేస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆ దిశగా సిద్ధమవుతున్నాయి. పార్టీలకతీతంగా ఎన్ని కలు జరుగనున్నప్పటికీ పరోక్షంగా పార్టీలకు సంబంధించిన వారే పోటీలో ఉంటారన్నది బహిరంగ రహస్యమే. అయితే ఈసారి మాత్రం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రె స్లు తమ అనుచరులను రంగంలో దింపి పోటీని రక్తి కట్టించనున్నాయంటు న్నారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో ప్రధాన పార్టీల అనుచరులు పోటీకి సిద్ధమవుతూ తమ కార్యాకలాపాలను ముమ్మరం చేస్తున్నారు.