Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు పాలనపై పూర్తి స్థాయి విశ్వసనీయంగా ఉన్నారని టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు కె.జైహింద్ అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులవ్వడంతో శుక్రవారం రాత్రి జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణా సంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం పార్టీకి శుభసూచకమని, రానున్న రోజుల్లో మరింత పటిష్టం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు పున్నారెడ్డి, హజ్రత్అలీ, రాజేష్, లక్ష్మణ్, హాజీ, విఘ్నేష్, మహేందర్రెడ్డి, శంకర్, వినోద్కుమార్, సత్యరాజు, ఆంజనేయులు, మహిళలు లత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.