Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చందానగర్
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తోనే బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత తెలిపారు. టీఆర్ఎస్ను రెండో సారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ను ప్రగతి భవన్లో శుక్రవారం నాగేందర్, సుజాత కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.