Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గచ్చిబౌలి
ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆలిండియా క్రాఫ్ట్ మేళా శనివారం నుంచి మాదాపూర్లోని శిల్పారామంలో ప్రారంభమవుతుంది. నేటి నుంచి 31 వరకు ఈ మేళా నిర్వహిస్తున్నట్టు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్రావు తెలిపారు. భారత దేశంలోని వివిధ రకాల చేనేత, హస్త, జ్యూట్, ఉడ్కార్వింగ్ కళాకృతులు రోజు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. 500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులచే ఈ సందర్భంగా కళాప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సందర్శకులకు వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయని, సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి హస్త కళలను ప్రోత్సాహించాలని ఆయన కోరార