Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకులు మజర్ఖాన్సాబ్
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని టీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ మజర్ఖాన్సాబ్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని కేసీఆర్ దక్కించుకోవడం సహా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా కె.పి.వివేకానంద్ రెండో సారి గెెలువడం శుభపరిణామమని చెప్పారు. శుక్రవారం రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి నెహ్రునగర్ ఎ-బి మహమ్మదీయ మజీద్, దావూద్ బస్తీ జమియా మజీద్లతో పాటు కృష్ణనగర్, సోనియాగాంధీనగర్, భవానినగర్ ప్రాంతాలలోని మజీద్ల వద్ద సుమారు 200 కెేజీల మిఠాయిల బాక్స్లను ముస్లిము సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అఖిల్, అదీల్ అలీ, షేక్ సాజిద్, మహమ్మద్ రవూఫ్, యాదుల్లా, షకీల్, మహమ్మద్ లతీఫ్, షర్ఫోద్దీన్, మేరాజ్ హుస్సేన్ పాల్గొన్నారు.