Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ - గచ్చిబౌలి
జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని శేరిలింగంనపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సహా ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తన వంతు క షి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంఎమ్మెల్యే గా రెండో సారి విజయం సాధించిన గాంధీ ని శుక్రవారం శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో, పుష్పగుచ్ఛాలను అందించి ఆయనను ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ జర్నలిస్టుల చిరకాల వాంఛగా మిగిలిపోయిన 52 మందికి గతంలో బౌరంపేట్లో మంజూరయిన ఇండ్ల స్థలాల పట్టాల ఆంశాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గాంధీని కోరారు. అందుకు శాసన సభ్యులు గాంధీ సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ముఖ్యంగా ప్రెస్ క్లబ్ భవన స్థల సేకరణ, నిర్మాణం విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చిందని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్యుజే హెచ్ 143 రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గంట్ల రాజిరెడ్డి, శేరిలిం గంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉప్పరి రమేష్ సాగర్, టీ యూడబ్ల్యూజే శేరి లింగంపల్లి ప్రెస్ క్లబ్ నాయకులు, కార్యవర్గ సభ్యులు అమత్ గౌడ్, అనిల్ రెడ్డి,మారుతీ కుమార్, మోటూరి నారాయణ రావు, రాజేష్, జగన్ రెడ్డి, శ్రీనివాస్, రాజు, రవీందర్ సాగర్, కృష్ణ, ఎల్లేష్, శ్రీనివాస యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.