Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా భారీ మెజార్టీతో విజయం సాధించిన రాష్ట్ర తాజా మాజీ మంత్రులు హరిష్రావు, జగదీశ్వర్రెడ్డి, ఈటెల రాజేందర్, పట్నం నరేందర్రెడ్డిలను బడంగ్పేట మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్రామ్రెడ్డి, ఉద్యమకారులు కలిసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలే టీఆర్ఎస్ విజయానికి దోహదం చేశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్కుమార్, సంతోష్, సద్దాంహుసేన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.