Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైళ్ల శాఖ డీజీ వీకే.సింగ్
నవతెలంగాణ-మలక్పేట
తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే.సింగ్ చంచల్గూడ జైలులో స్మార్ట్ కియోస్క్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల సంక్షేమా నికి సంబంధించిన సమాచారం, కేసు, కోర్టు వివరాలు, మూలఖత్ వివరాలు, ఖైదీల వ్యక్తిగత డబ్బు, సమాచా రంను కియోస్క్ ద్వారా సులభంగా తెలుసుకోవ చ్చన్నారు. ఖైదీల కోసం ఎక్కడ లేని విధంగా అనేక సదు పాయాలను తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో చేపడుతు న్నట్టు తెలిపారు. ఖైదీల కోసం చేపట్టే విద్యాధాన కార్యక్రమం ఎంతో మంది ఖైదీలను విద్యావంతులుగా చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో డీఐజీ సైదయ్య, జైలు పర్యవేక్షణ అధికారి అర్జున్రావు, ఉప పర్యవేక్షణ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఎం.సంపత్, సిబ్బంది సాయిబాబా పాల్గొన్నారు.