Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీగల కృష్ణారెడ్డి
నవతెలంగాణ - మీర్పేట్
మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినందుకు అధైర్యపడొద్దని, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉందని కార్యకర్తలందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ చౌరస్తాలో కేసీ ఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సంద ర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటు లో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా ఎన్నికైన వారికి అభివృద్ధి కోసం సహకరి స్తామని, అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జిల్లెల్ల నరేందర్రెడ్డి, ఎంపీటీసీ తీగల నితీష్రెడ్డి, తీగల రంజిత్రెడ్డి, శృతి భూపేష్గౌడ్, వేముల నర్సింహ, సిద్ధాల దశరథ, కిరణ్గౌడ్, లలితా జగన్, విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ పాండు గౌడ్, బడంగ్పేట్ నగర పంచాయతీ మాజీ ఛైర్మన్ సామ నర్సింహాగౌడ్, నాయకులు రవి నాయక్, సాలయ్య, జోజి, పద్మ పాల్గొన్నారు.