Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డిని తన నివాసంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొర్ర రవిమాదిగ శుక్రవారం కలిసి పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్, టీడీపీ, ఎమ్మార్పీఎస్, టీజేఎస్ పార్టీలకు చెందిన నాయకులు పూర్తిగా సహకరించి నా విజయం కోసం పనిచేశారని తెలిపారు. నియోజక వర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటానికి అసెంబ్లీలో ప్రభుత్వంతో పోరాటం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ మండల ఎమ్మార్పిఎస్ అధ్యక్షులు దానయ్య, సీనియర్ నాయకులు అమృష్, యంజాల యాదగిరి, దాసుప్రకాష్, అర్జున్, జల్పల్లి, మీర్పేట్ మున్సిపాలిటి అధ్యక్షులు శివకుమార్, ఆనంద్, మండల ఉపాధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి ఉపేందర్, దేవేందర్, మహిళా రాష్ట్ర నాయకులు జె. ఇందిరమ్మ, మహేశ్, అంజయ్య పాల్గొన్నారు.