Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నియామకం పట్ల కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరు పుకున్నారు. శుక్రవారం పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. డివిజన్ అధ్యక్షుడు రాపోలు సతీష్, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నాగిళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో...
కుషాయిగూడలో టీఆర్ఎస్ నాయకులు బాణాసంచా కాల్చి, స్వీట్ పంపిణీ చేశారు. సీనియర్ నాయకులు నాగిళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. నారెడ్డి రాజేశ్వరెడ్డి , బుచ్చన్నగారి శ్రీకాంత్ రెడ్డి, మల్లేష్ వంశీరాజు, తోటకూర సురేష్ రెడ్డి, హరి నాయి, జైపాల్ రెడ్డి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.