Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధూల్పేట్
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహమూద్ అలీ చారిత్రక మక్కామసీద్ను సందర్శించారు. శుక్రవారం మక్కాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడు తూ.. దేశంలోనే మొట్టమొదటి సారిగా ముస్లీంకు డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుం దని తెలిపారు. కేసీఆర్ పాలన కులమతాలకు అతీతంగా ఉంటుందని, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు మక్కామసీదులో ప్రార్థనలకు హాజరైనట్టు తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్కమీషనర్ చౌహన్, దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా, బాబురావు, అదనపు డీసీపీ సయ్యద్ రఫీక్, ఏసీపీ అంజయ్య, మైనార్టీ నేతల అక్బరుస్సేన్, వహీదుద్దీన్లు పాల్గొన్నారు.