Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని పంచశీలకాలనీ రెసిడెన్సియల్ వెల్ఫేర్ సోసైటి ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎన్నికల నిర్వాహణపై స్టీరింగ్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు కాలనీ ఎన్నికల నిర్వాహణ విధి విధానాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో నివాసం ఉండే వారికే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒకే ప్యానల్పై పోటీ చేయాలని తెలిపారు. ఒకే పేరు మీద కాలనీలో ఎన్ని ప్లాట్లు ఉన్న ఓటు మాత్రం ఒకటే ఉంటుందని, కాలనీలో లేకుండ పరిశ్రమలు నడుపుతున్న ప్లాట్ యజమానులు ఓటు వేయాలని సూచించారు. బ్యాలెట్లో నోటాను కూడా ఏర్పాటు చేశామన్నారు. గెలిచిన కమిటీ మూడు సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. ఈ నెల 26, 27ల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేయాలని, 27న సాయంత్రం పరిశీలిస్తామని తెలిపారు. 30న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు నందనం దివాకర్, గట్టారెడ్డి, సుంకరి మల్లేష్గౌడ్, కాపా సుబ్బారెడ్డి, జిల్లెలా రవీందర్రెడ్డి, చిల్లా రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.