Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
అనువాద సాహిత్య ప్రక్రియలో నిధి వంటి వారు స్వాతి శ్రీపాద అని సినీ గీత రచయిత డాక్టర్ సుద్ధాల అశోక్తేజ ప్రశంసించారు. వాసిరెడ్డి సీతాదేవి వంశీ గ్రంథాల యం నిర్వహణలో వాసిరెడ్డి సీతాదేవి 85వ జయంతి సందర్భంగా స్వాతి శ్రీపాదకు వంశీ సాహిత్య పురస్కారం శనివారం ప్రదాన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అశోక్తేజ పాల్గొని ఆమెను సత్కరించి మాట్లాడుతూ స్వాతి త్రిభాషల్లోనూ అత్యంత భాషా పటిమ గల రచయిత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, రచయిత్రి శైలజా మిత్ర, ఉదయ పద్మ, అబుదబి, తదితరులు పాల్గొన్నారు. ఉదయ పద్మ 50వేల రూపాయల నగదును వేగేశ్న వికలాంగుల ఆశ్రమానికి విరాళం ఇచ్చారు. డాక్టర్ తెన్నేటి సుధా స్వాగతం పలికిన కార్యక్రమానికి వంశీ రామరాజు అధ్యక్షత వహించగా, శైలజ వందన సమర్పణ చేశారు.