Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 6వ వార్డులోని సాయిబాబా కాలనీలో మురుగునీటిని పరిష్కరించేందుకు బోర్డు సభ్యుడు పాండుయాదవ్ రూ.5 లక్షల నిధులతో భూగర్భ డ్రయినేజీ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనులు పూర్తయ్యాయని, కాలనీలో మురుగు నీటి సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ఎప్పటికైనా అనేక బస్తీలలో, కాలనీలలో మురుగు సమస్యలను పరిష్కరించామని, పురాతన మురుగు కాలువలను పరిష్కరించి ప్రస్తుత జనాభాకు అనుగుణంగా నిర్మాణం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో సుందర్, కృష్ణారావు, లింగం, అశోక్కుమార్, చారి, అరుల్దాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు.