Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
ఓయూ కామర్స్ కళాశాల యందు 1992-1994 బ్యాచ్కి చెందిన ఎంబీఏ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహిం చారు.
వారు కళాశాల ఎంబీఏ విభాగం ఉన్నతికి తప్పకుండా పాటు పడతామన్నారు. తమకు ఉపాధి బాటలు వేసిన ఎంబీఏ విభాగంలో తమ వంతుగా వసతుల కల్పనతో పాటు ప్రస్తుతం మెరిట్ గల విద్యార్థులకు సహకరిస్తామని తెలిపారు. అనంతరం నాటి తగ గురువులతో పాటు ప్రస్తుత ఆచార్యులను వారు ఘనంగా సత్కరించారు. వర్సిటి గొప్పతనాన్ని ప్రశంసించారు. అనంతరం ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆనాటి జ్ఞాపకాలని నెమరువేసుకున్నారు. అందరు ఒకే రకమైన టీషర్ట్స్ ధరించి గ్రూప్ ఫొటోలు దిగారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య విద్యాసాగర్ రావు, వరప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, జగదీష్, కమలాకర్తో పాటు 30 మంది 1992-1994 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.