Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
అమీర్పేట మెట్రో రైలుస్టేషన్ మొదటి అంతస్తులో టిక్కెట్ కౌంటర్కు దగ్గరలో ఐటీ సంస్థల ఉద్యోగులు ఏర్పాటు చేసిన హాండ్లూమ్ స్టాల్ను హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉందని, యూరోప్ దేశాలు, అమెరికా వంటి విదేశీయుల అవసరాలను దృష్టిలో వుంచుకుని మన ఖాదీ వస్త్ర రంగంలో పేరెన్నికగన్న పోచంపల్లి, గద్వాల, నారాయణ్ ఖేడ్ తదితర ప్రాంతాల్లోని నేతన్నలు తమ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. చేనేత వస్త్రాలకు తగిన ప్రచారం కల్పించే రీతిలో ఉప్పల్, నాగోలు మెట్రో రైలు స్టేషన్ల ఫుట్పాత్లకు పోచంపల్లి, గద్వాల్ వస్త్రాల డిజైన్లను ఉపయోగించామన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు పలు ఐటీ సంస్థల ఉద్యోగుల పక్షాన ఈ హాండ్లూమ్ స్టాల్ ను ఏర్పాటు చేశామని ఐటీ రంగ ప్రతినిధి శ్రీ సత్య అన్నారు. ఈ స్టాలు నేటి నుండి 15 రోజులపాటు అమీర్పేట మెట్రో ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, పోచంపల్లి, గద్వాల, ఇక్కత్ డిజైన్ లతో పలు చీరలు, షర్టులు, దుప్పట్లు తదితర అనేక దుస్తులను ఆధునికరీతిలో ప్రదర్శనకు ఉంచామన్నారు.