Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
రైళ్లల్లో ఇంధన పొదుపు చేసినందుకు గానూ దక్షిణ మధ్య రైల్వేకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంధన మంత్రిత్వ శాఖ తరపున ఆరు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు లభించా యి. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ అవార్డులను రైల్వే అధికారులు అందుకున్నారు. ప్యాసింజర్ రిజర్వేషన్ సిష్టం కార్యాలయం భవనానికి ప్రతిష్టాత్మక ప్రథమ బహుమతి లభించగా ఈ అవార్డును దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏఏ.ఫడ్కే, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదన్ అందుకున్నారు. ఇతర అవార్డుల్లో పీడబ్య్లూడీ సీపీడబ్ల్యూడీ, పీహెచ్ఇడీ భవనాల నిర్వహణ విభాగంలో సికింద్రాబాద్ రైల్ నిలయం, హైదరాబాద్ భవన్ (డీఆర్ఎం కార్యాలయం హైదరాబాద్)లకు సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డులు, రైల్వే స్టేషన్ల విభాగంలో హైదరాబాద్, కాజీపేట, నిజామాబాద్ స్టేషన్లకు ఈ అవార్డులు ప్రకటించారు.