Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు
నవతెలంగాణ- ముషీరాబాద్
ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. శనివారం ఆ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షనర్ల పట్ల ప్రభుత్వం వ్యతిరేక ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. హై ఇంపవర్డ్ మానిటరింగ్ కమిటీ నివేదికను వెంటనే సమర్పించాలని, తక్షణమే తాత్కాలిక భృతి మూడు వేలు చెల్లించాలని కోరారు. కనీస పెన్షన్ 9000 గా నిర్ణయించాలని, పెన్షనర్లందరికీ ఈఎస్ఐ వైద్య వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లకు కార్మికులకు మాదిరి కరవు భత్యం చెల్లించాలని, జీఎస్ఆర్ 609(ఈ) సవరణలపై కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీబీటీ నిర్ణయాలని తక్షణమే అమలు చేయాలని, హయ్యర్ పెన్షన్పై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వ దృ'ష్టికి తెచ్చేందుకు సంతకాల సేకరణ చేసి ఈనెల 15 న రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రధాన మంత్రికి పంపుతున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 19 న అన్ని ఈపీఎఫ్వో కార్యాలయాల ఎదుట నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఏఆర్కే చౌదరి, పి.నారాయణరెడ్డి, ఎన్.బ్రహ్మచారి, ఎం.ఎన్.రెడ్డి, ఎం.నరహరి, ఎన్.సోమయ్య, నాగేశ్వరావు పాల్గొన్నారు.