Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
నవతెలంగాణ- ధూల్పేట్
ఈ నెల 18 నుంచి జియాగూడ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను ఐదురోజుల పాటు రంగనాథ్స్వామి దేవాలయంలో నిర్వహించనున్నట్టు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం సాయంత్రం రంగనాథ్స్వామి దేవాలయంలో ప్రభుత్వ అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, ఉత్సవాల బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు జంట నగరాల నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు వస్తారని తెలిపారు. దీని దృష్ట్యా పలు విభాగాల ప్రభుత్వ అధికారులతో కలిసి తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు , మహాప్రసాద వితరణ కొనసాగుతుందనిఆలయ చైర్మన్ ఎస్టీ చారీ, ప్రతినిధి శేషచార్యులు తెలిపారు.
భారీ ఏర్పాట్లు..
ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉన్న దృష్ట్యా పురాణపూల్ నుంచి ట్రాఫిక్ తలేత్తకుండా, ఆర్టీసీ బస్సులు, వాహనాలను బైపాస్ నుంచి మళ్లించారు. కాలినడకన ఆలయానికి చేరుకోవాల్సిందే. డ్రయినేజీ మరమ్మతులు, ఫైర్ ఇంజన్, అదనపు ట్రాన్స్ఫార్మర్, మోబైల్ యూరినల్స్, పార్కింగ్ సౌకర్యం, మహిళా పోలీసులు, బందోబస్తు, సీసీ కెమెరాల పర్యావేక్షణ, పురాణపూల్ నుంచి దేవాలయం వరకు బీటి రోడ్డు నిర్మాణం, హెల్త్ అండ్ షానిటేషన్ పరిసరాల పరిశుభ్రత పలు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గోషామహల్ ఏసీపీ ఎం.నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ల మిత్రకృష్ణ, శంకర్ యాదవ్, ప్రేమ్సింగ్ రాథోడ్, పరమేశ్వరి సింగ్, బంగారి ప్రకాష్, ఠాకూర్ జీవన్సింగ్, శేఖర్రెడ్డి, ఆనంద్సింగ్, డివీఎస్ రాజు, శేఖర్యాదవ్, ముకుంద్రావు, కుల్సుంపురా ఇన్స్పెక్టర్ పి.శంకర్, పలు విభాగాల ప్రభుత్వాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.