Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల అభివృద్ధి దేశానికే ఆదర్శం
- బీహర్ వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ దివాజీ కుమార్
నవతెలంగాణ- చాధర్ఘాట్
వైకల్యం మానవ అభివృద్ధికి అడ్డుకాదని బీహర్ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ దివాజీకుమార్ అన్నారు. శనివారం మలక్పేట్లోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయ బ్రెయిలీ ప్రెస్, వికలాంగుల ఉద్యానవనాన్ని సందర్శించారు. తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ వికలాంగుల కోసం చేపడుతున్న పథకాలు, ఎన్నికల్లో వారికి తీసుకున్న ప్రత్యేక ఏర్పాట్లను ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగులకు సమాజంలో సముచిత స్థానం లభించేలా అందరూ కృషి చేయా లన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్విని యోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరు కోవాలని వికలాంగులకు సూచించారు. ఈ కార్య క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ పుష్పలత, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కో ఆర్డినేటర్ మురళీ, బ్రెయిన్ ప్రెస్ ఎడిటర్ వెంకటేశ్వర్ రావు, మెనేజర్ రమేష్, సిబ్బంది బాలాజీ తదితరులు పాల్గొన్నారు.