Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శనివారం హయత్నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జిల్లా గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యయుడు శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ నిత్య జీవితంలో గణితం ఆవశ్యకతను, ప్రయోజనాలను వివరించిన ఘనత రామానుజన్కే దక్కుతుందన్నారు. చంపాపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన శరత్కుమార్, ఇబ్రహీంపట్నం జీహెచ్ఎస్కు చెందిన అభివన్, ప్రభుత్వ పాఠశాల ఆరుట్లకు చెందిన ఉషశ్రీ, మన్సురాబాద్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉషశ్రీ, చర్ల పటేల్ గూడ ప్రభుత్వ పాఠశాలకు చెందిన శ్రీనివాస్ రావు. ప్రభుత్వ పాఠశాల మన్ మర్రికి చెందిన సంధ్య రాణిలు గణిత టాలెంట్లో గొలుపొందారు. అనంతరం వారు రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతిభ పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామచంద్రా రెడ్డి, యాదగిరిరెడ్డి, గోవర్ధన్, శ్రీనివాస్, చక్రపాణి, జనగ్ రెడ్డి, శ్రీశైలం, రామకృష్ణ, ప్రవీన్కుమార్, రాములయ్య పాల్గొన్నారు.