Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్చక పురోహిత సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్చార్యులు
నవతెలంగాణ- ఘట్కేసర్
అర్చకుల, పురోహితుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని భాగ్యనగర్ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు. శ్రీనివాస చార్యులు అన్నారు. ఘట్కేసర్ ప్రెస్క్లబ్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని హెచ్బీ కాలనీలో శ్రీదేవి భూదేవి సవేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు పాగింగపల్లి ఫనికూమర్ ఆచార్యులు ఆలయ ధర్మకర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇరు రాష్రాల్లో ఉన్న అర్చకులు, పురోహితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ప్రయివేట్ ఆలయల్లో అర్చకులకు రూ.10,000 కనీస వేతనం, వసతి, గుర్తింపు, హెల్త్ కార్డులుండేలా చర్యలు తీసు కోవాలని కోరారు.
ఘట్కేసర్ బాలజీనగర్లోని గీతా మందిర్లో 30 ఏండ్లుగా శివరామకోటి యజ్ఞనాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దానిని దేవాదయ ధర్మదాయ శాఖ భూముల్లో భక్తుల సహాయ సహకారములతో నిర్మించినట్టు తెలిపారు. కానీ ప్రస్తు తం నడుస్తున్నటువంటి బ్రహ్మత్సోవాల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తు న్నారని చెప్పారు. ఈ విషయంపై కమిషనర్ తక్షణమే స్పందించి ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు ఆరుట్ల కరుణాకరాచార్యులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉండి సుబ్రమణ్యదీక్షితులు, మౌలాలి డివిజన్ అధ్యక్షులు ఆరుట్ల మోహనాచార్యులు పాల్గొన్నారు.