Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
గడిచిన శాసన సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాతంగా నిర్వహించడంలో సిబ్బంది పాత్ర ఎనలేనిదని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు.
శనివారం మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇతర అర్బన్ జిల్లాల కంటే మేడ్చల్ జిల్లాలో పోలింగ్ శాతం పెంచ డంలో సిబ్బంది చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అన్ని డిపార్టుమెంట్లకు చెందిన సిబ్బంది సమన్వ యంతో కలిసి కట్టుగా పని చేశారని తెలిపారు. మేడ్చల్లో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్, కౌంటింగ్ వరకూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీపీఆర్వో కె.మధుకర్ రెడ్డి, ఆర్వోలు మమత, లచ్చిరెడ్డి, కృష్ణ, శేఖర్, జిల్లా అధికారులు, ఏఆర్వోలు పాల్గొన్నారు.