Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన భారత ఉపరాష్ట్రపతి
- తొలిరోజే వీక్షకుల విశేష స్పందన
- 331 గ్రంథ విక్రయ కేంద్రాలు
- బాలల, ఆధ్యాత్మిక, శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన, వినోద గ్రంథాలెన్నో..!
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
31 సంవత్సరాల లాగానే ఈ సంవత్సరమూ తెలంగాణ కళా భారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో 10 రోజుల పాటు జరిగే పుస్తక ప్రదర్శన శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. గత సంవత్సరాల కంటే భిన్నంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రదర్శనను ప్రారంభించారు. దీంతో పుస్తక ప్రదర్శనకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గౌర వం, గుర్తింపు లభించిం ది. తొలిరోజు విశేషంగా వీక్షకులు ప్రాంగణంలో తమకు నచ్చిన పుస్తకాలను ఎంచుకునేందుకు సందడి, సందడిగా కలియతిరిగారు.
331 గ్రంథ విక్రయశాలలను
శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 59మందిపై కేసులు నమోదు అయ్యాయన్నారు. అందులో 52మంది ఈవ్ టీజర్లు పట్టుబడ్డారని, అందులో 26మంది పై ఎఫ్ఐఆర్, నమోదు అయిందన్నారు. 21 పిట్టీ కేసులు, 5గురికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో మహిళకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుడీపై ఉందన్నారు.
ఆధారాలు సమర్పించిన వారికి రివార్డు మేళా
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో సంచలనమైన వాటిని సైతం చేదించి తద్వారా దోషుల ద్వారా కీలక ఆధారాలను రాబట్టి కోర్టు ముందు పొందుపర్చి వారికి కఠిన కారాగార శిక్షలతో పాటుగా జరిమానాలు విధించిన కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి, వారికి తోడు కోర్టులో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సైతం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ మొత్తం 87మందికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డు అందజేశారు. శనివారం ఎల్బీనగర్లో ఉన్న కామినేనిలో ఉన్న ఆడిటోరియంలో జరిగిన రివార్డు మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం ముందు ఒక్క దోషి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఏ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనే నినాదంతో పోలీసులు పనిచేయాలన్నారు. గత నెల, ఈ నెలలో మొత్తం 38 కీలక కేసుల్లో పలు నేరస్తులకు శిక్షలతో పాటుగా జరిమానాలు విధించిన అన్ని విభాగాల పోలీస్ సిబ్బందికి, ఇఇన్విస్టిగేషన్ అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అభినందనలు తెలియజేశారు. ప్రజలకు నిత్యం భయాందోళనకు గురిచేసే పాతనేరస్తులు, రౌడీ షీటర్లకు పీడీ యాక్టులు నమోదు చేయడంలో తమ సిబ్బంది కృషి అమోగమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూటర్ రాము, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీరెడ్డి, ఎపీసీలు శివకుమార్, హరగోపాల్, క్రైం డీసీపీ నాగరాజు పాల్గొన్నారు.