Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన భారత ఉపరాష్ట్రపతి
- తొలిరోజే వీక్షకుల విశేష స్పందన
- 331 గ్రంథ విక్రయ కేంద్రాలు
- బాలల, ఆధ్యాత్మిక, శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన, వినోద గ్రంథాలెన్నో..!
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
31 సంవత్సరాల లాగానే ఈ సంవత్సరమూ తెలంగాణ కళా భారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో 10 రోజుల పాటు జరిగే పుస్తక ప్రదర్శన శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. గత సంవత్సరాల కంటే భిన్నంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రదర్శనను ప్రారంభించారు. దీంతో పుస్తక ప్రదర్శనకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గౌర వం, గుర్తింపు లభించిం ది. తొలిరోజు విశేషంగా వీక్షకులు ప్రాంగణంలో తమకు నచ్చిన పుస్తకాలను ఎంచుకునేందుకు సందడి, సందడిగా కలియతిరిగారు.
331 గ్రంథ విక్రయశాలలను
ఈ సంవత్సరం ఏర్పాటు చేసినట్టు అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి చంద్రమోహన్ తెలిపారు. 331 విక్రయశాలల్లో బాలల కథలు, ఆధ్యాత్మిక సంబంధమైన గ్రంథాలు, విద్యార్థులకు అవసరమయ్యే శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన గ్రంథాలతోపాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, పలువురు రచయితల నవలలు, కథానిక సంపుటులు, ఆంగ్లంలో ప్రముఖ రచయితల ఉద్ఘాందాలు, అరుదైన ఉపయుక్తమైన సమాచార పొత్తాలు, ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, హైదరాబాద్, విజయవాడ ప్రచురణ కర్తల విక్రయశాలల్లో పుస్తక ప్రేమికులను పలకరిస్తున్నాయి. తెలుగు, ఆంగ్ల దిన పత్రికల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్య, వైద్య సంబంధిత దుకాణాల వద్ద యువత, వృద్ధులు వారికి అవసరమైన గ్రంథాల కోసం పరిశీలించటం కనిపించింది. కళా ప్రదర్శనలకు నిర్మించిన వేదికకు సంఘం లక్ష్మీబాయి వేదికగా పేర్కొన్నారు. తొలిరోజు ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ బాలబాలికలు గూమర్ నృత్యంతో కనువిందు చేశారు. తెలంగాణ ప్రాచీన జానపద కళా ప్రక్రియ ఒగ్గుడోలు ప్రదర్శన ఒగ్గురవి నిర్వహణలో డప్పులతో హోరెత్తించారు.