Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ సంఘం సభ్యులు కార్పొరేటర్కు వినతి
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజిగూడ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్కాలనీ సమస్యలు పరిష్కరించాలని కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో ఇప్పటి వరకు యూజీడీ లైన్లు, బీటీ, సీసీ రోడ్లు వేయించమన్నారు. త్వరలో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, యూజీడీ లైన్ల పనులు చేపడుతామని తెలిపారు. కాలనీలో కావాల్సిన చోట్ల విద్యుత్ స్థంభాలు, లైట్లు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు యేసుదాస్, కాలనీవాసులు సురేష్, జనార్దన్, రామకృష్ణ పాల్గొన్నారు.