Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్త దూరం కావడం.. రోడ్డు ప్రమాదంలో రోడ్డున పడ్డ దళిత మహిళ..
నవతెలంగాణ-హయత్నగర్
భర్త దూరమై.. రోడ్డు ప్రమాదంలో రోడ్డున పడ్డమని మాకు దాతలు సహకరించాలని ఓ దళిత మహిళ వేడుకుంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ దళిత మహిళ పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలు అనుభవిస్తుంది. అమె పేరు పంది రాధ.. తనకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక పాప, బాబు. ఆమె పుట్టింది ఆంధ్రాలో అయినా పోట్టగూటి కోసం నగరానికి 8 ఏండ్ల క్రితం వలస వచ్చి మన్సురాబాద్లోని సాయి సప్తగిరి కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు పిడ్స్ ఉందని తెలపిని భర్త మూడేండ్ల క్రితం భార్యపిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. పొట్టగూటి కోసం కొన్నేండ్లుగా కొన్ని చోట్ల ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆయాగా పనిచేసింది. ప్రస్తుతం పని లేకపోవడంతో పని కోసమని ఈ నెల 11న కొత్తపేటలో ఉన్న సాయి సంజీవిని హాస్పటల్కు వెళ్లింది. అక్కడ ఎల్బీనగర్కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని ద్విచక్రవాహనం ఆమెను ఢ కొనడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆదే సమయంలో గుర్తు తెలియని కారు ఆమె ఎడమ కాలుపై నుంచి పోయింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. ప్రస్తుతం ఎల్బీనగర్లో ఉన్న మెడిక్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దీంతో తన పిల్లలను పోషించుకోవడం చాలా భారంగా మారింది. తనని దాతలు ఆదోకావాలని ఆమె కోరింది. సహాయం చేయదల్చిన వారు 8340011746 నంబర్కు ఫోన్ చేయగలరు.