Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ పద్మా నాయక్ ఈస్ట్ జోనల్ కమిషనర్కు వినతి
నవతెలంగాణ-వనస్థలిపురం
హస్తినాపురం డివిజన్లోని పేదల బస్తీలల్లోని సమస్యలు పరిష్కరించి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్ కోరారు. ఈ మేరకు ఆమె ఈస్ట్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలో పెండింగ్ ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేశవపురికాలనీ డ్రయినేజీ సమస్య, సౌత్ హస్తినాపురం రోడ్డు వెడల్పు, సంతోష్మాతకాలనీలో సీసీరోడ్డు, ఇంద్రసేనారెడ్డినగర్లో సామాజిక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు గౌడ్ పాల్గొన్నారు.