Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
నిరుపేదలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటోందని, వారికి అండగా ఉంటోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులు తెలిపారు. మంగళవారం చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి,, షాదీ ముబారక్లకు అర్హులైన 88మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులకు రూ.8135000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తోందని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి, తహసీల్దార్ గౌతంకుమార్, కార్పొరేటర్లు జగన్, సత్యనారాయణ, నాయకులు రాజేందర్రెడ్డి, విశాల్ పాల్గొన్నారు.