Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దుండిగల్
దుండిగల్ మున్సిపాలిటీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు 2 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వారికి వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ కుత్బుల్లాపూర్ కార్యదర్శి బి.లింగుస్వామి డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం దుండిగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొని లింగుస్వామి మాట్లాడుతూ..వేతనాలు అందకపోవడంతో కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. వేతనాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వాటర్మెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి వారికి రూ.22 వేలు, కార్మికులకు రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహా, సురేందర్, సీఐటీయూ నాయకులు ఎల్లయ్య, కార్మికులు కృష్ణ, స్వామి, మల్లేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.