Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గచ్చిబౌలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో కూకట్పల్లి సర్కిల్ పరిధి ఆల్విన్కాలనీ, హైదర్నగర్, వివేకానందనగర్, కూకట్పల్లి డివిజన్ ఫరిధిలోని అభివృద్ధి పనులపై సర్కిల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల నిర్వాహణలో జాప్యం చేయొద్దని సూచించారు. మోర్ సూపర్ మార్కెట్ రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రగతినగర్ నుంచి శంశీగూడ వరకు 100 ఫీట్ల సమాంతర రోడ్డును త్వరితగతిన చేపట్టాలని, భాగ్యనగర్ కాలనీలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఆస్బెస్టాస్ కాలనీలోని లేఅవుట్, కమ్యూనిటీ హాల్ వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. అధికారులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఉపకమిషనర్ అశోక్సామ్రాట్, ఏసీపీ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్తో కలిసి అంబీర్ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందనతో కలిసి మంగళవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అంబీర్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గుర్రపు డెక్కను తొలగించి, నీటి కాలుష్యం కాకుండా చూడాలన్నారు.
పరిశ్రమల వ్యర్థ జలాలను కలువకుండా చూడాలని ఆదేశించారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జేఎన్టీయూ నుంచి ప్రగతి నగర్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమాంతర రోడ్డును అభివృద్ది చేస్తే ఈ సమస్యకు పరిష్కారం కలుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే గాంధీ
నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు బ్రిడ్జీలు పూర్తయ్యాయని, మరో ఐదు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటిని త్వరగా ప్రమాదరహితంగా, ప్రజానుకూలంగా నిర్మించాలని సూచించారు. ఈఈ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జీలతో పాటు ప్రజలు మెట్రో స్టేషన్లలోని ఎస్కలేటర్లు, లిఫ్ట్లను ఉపయోగించుకుని రోడ్డు దాటవచ్చని తెలిపారు.