Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త కుటుంబసభ్యుడికి టీఆర్ఎస్ సభ్యత్వ ఇన్సూరెన్సు సొమ్మును ఆ పార్టీ సుభాష్నగర్ అధ్యక్షులు మంగళవారం అందజేశారు. వివరాల్లోకెళితే.. 4 నెలల క్రితం సూరారం కాలనీ రాజీవ్ గహకల్ప వాసి, టీఆర్ఎస్ కార్యకర్త విశాల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ సుభాష్నగర్ డివిజన్ అధ్యక్షులు దేవగారి.రాజేందర్రెడ్డి ఎమ్మెల్యే వివేకానంద్ దష్టికి తీసుకెళ్లారు. టీఆర్ఎస్ సభ్యత్వం ద్వారా వచ్చే రూ.2 లక్షల బీమా సొమ్మును అందేలా చూడాలని ఎమ్మెల్యే తెలిపారు. బీమా చెక్కును మృతుడి తండ్రి నరసింహారెడ్డికి నాయకులు రాజేందర్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.