Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చందానగర్
సైబరాబాద్ సీపీ వీసీ.సజ్జనార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు స్టూడెంట్ పోలీసు క్యాడెట్ క్రాఫ్ట్స్ నిర్వహించినట్టు చందానగర్ సీఐ రవీందర్, ఎస్ఐ శంకర్లు తెలిపారు. ఈ క్రాఫ్ట్స్కు 176 మంది విద్యార్థులు హాజరుకాగా 44 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఇందులో విద్యార్థులు 22 మంది, విద్యార్థినులు 22 మంది ఉన్నట్టు తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులకు 100 మీటర్ల నుంచి 400 మీటర్లు లాంగ్ జంప్ నిర్వహించి, రాత పరీక్ష నిర్వహించినట్టు చెప్పారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జెడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ ఎల్.శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.