Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
ఎన్టీఆర్, ఏఎన్నార్ల సరి సమానంగా నాడు వెండితెరపై వెలుగులు విరజిమ్మిన జమున పార్లమెంట్ సభ్యురాలిగా రంగస్థల కళాకారులకు చేసిన సేవలు విస్మరించలేమని తమిళనాడు పూర్వ గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య కొనియాడారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గానసభలో డాక్టర్ జమున రమణరావుకు ఎన్టీఆర్-ఏఎన్నార్-వంశీ జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వెండి కిరీట ప్రధానోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రోశయ్య జమునను సత్కరించి అభినందించారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన సభలో సినీ దర్శకులు రేలంగి నరసింహరావు, ననీమణులు గీతాంజలి, రోజారమణి పాల్గొని జమున ప్రతిభను కొనియాడారు. వంశీ రామరాజు స్వాగతం పలికిన సభలో కెవి రమణరావుకు ఎన్టీఆర్ సేవా పురస్కారం, ఎఎస్ మూర్తికి ఏఎన్నార్ సేవా పురస్కారం బహుకరించారు. ఈ సందర్భంగా గీతాంజలి, సుజారమణ, కాకినాడ రమణ, మోహన్, తదితరులు పాడిన సినీ గీతాలు ఆకట్టుకున్నాయి.