Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
శ్రీ త్యాగరాయ గానసభలోని కళాదీక్షితులు కళావేదికపై మంగళవారం ఆకాక్ష ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవాణి శిష్యబృందంచే నృత్య విభావరి జరిగింది. మేఘన, హరిచందన, అధ్వైత, నిహారిక, చిన్మయి, శ్రీవిద్య, జోత్న్స, హాసిని, తదితర కళాకారిణిలు పాల్గొని అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలతోపాటు జానపద నృత్యాలను ప్రదర్శించారు. గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి పాల్గొన్న సభలో సేక్రెడ్స్పేస్ ఫౌండర్ నయనతార నందకుమార్, తెలంగాన జాగృతి నాయకురాలు వరలక్ష్మి మంచాల, మిమిక్రి కళాకారుడు బుర్ర మోహనకృష్ణ పాల్గొనగా సంస్థ అధ్యక్షురాలు సంధ్యారాణి స్వాగతం పలికారు.