Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బేగంపేట
సికింద్రాబాద్ జనరల్ బజార్లో నూతనంగా నిర్మించిన జైన దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు వెస్లీ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఇదే ప్రాంతంలో శాంతినాద్ భగవాన్ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. దేవాలయ ఆవరణలో ప్రతి రోజు ప్రత్యేక పూజ కార్యక్రకమాలు నిర్వహిస్తుండగా వెస్లీ మైదానంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది జైనులు హాజరవుతున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి ఆధ్యాత్మిక నాటికలు, సాయంత్రం 7 గంటలకు భక్తి గీతాలు భజనలు ఏర్పా టు చేశారు. ముంబాయి నుంచి వచ్చిన ప్రముఖ విదీత్ గేమావత్ బృం దం పాటలతో అలరిస్తున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
జైనుల 16వ తీర్ధాంకర్ శాంతినాద్ భగవాన్ జనన వృత్తాంతాలను వివరిస్తూ వేసిన నాటిక అద్భు తంగా సాగింది. విశ్వసేన మహారజ్, తల్లి ఆచిలా మాతలకు పెళ్ళైన తర్వాత ఆచిలామాత శాంతినాద్ భగవానుడు గర్భంలోకి వచ్చిన విధానాన్ని 8-12 ఏండ్ల చిన్నారులు కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఈ నెల 26 తేదీ వరకు ఒక్కో రోజు ఒక్క ఇతివృత్తంతో శాంతినాధ్, జీవిత చరిత్ర నాటక రూపంలో ప్రదర్శిస్తున్నట్టు నిర్వాహకులు దినేష్ జైన్ తెలిపారు.