Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేరేడ్మెట్
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరిం చుకొని నేరేడ్మెట్ వినాయక్నగర్ డివిజన్లలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు ప్రక్రియకు విశేష స్పందన వచ్చిందని డివిజన్ కార్పొరేటర్లు శ్రీదేవి, బద్దం పుష్పలతారెడ్డి అన్నారు. అనం తరం కార్పొరేటర్ శ్రీదేవి యాప్రాల్లో డివిజన్ అధ్యక్షులు మధుసూధన్రెడ్డి ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండా లని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నిర్వ హించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో గెలు పొందిన విజేతలు యూసుఫ్, జ్యోత్న్స లత, ప్రశాంత్, రాజశేఖర్, భాగ్యవతి, అతిక్లకు ప్రిన్సి పల్ బహుమతులను అందజేశారు. శంకర్ రావు, జ్యోత్న్స, శ్రీనివాస్, రాజు, జాన్, మహేష్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.