Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
మేకిన్ ఇండియా పేరుతో వంద శాతం రక్షణ రంగంలో విదేశీపెట్టుబడులు, ప్రయివేటీకరణ దేశ రక్షణకు, సార్వభౌమత్వానికి ప్రమాదకరమని సీఐ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. సోమవారం డీఆర్డీఎల్ గేటు వద్ద సంయుక్తంగా యూనియన్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య వక్తగా ఆయన హాజరై మాట్లాడుతూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వంద శాతంమ ప్రయివేటీకరణ విధా నాలు స్వాలంభనకు, స్వయం అభివృద్ధికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, 52 డీఆర్డీఓ ల్యాబరేటరీలు, 9 ఆర్మీ బేస్ వర్క్షాప్లు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలు రక్షణ రంగాన్ని బడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసే విధంగా ఉన్నా యని పెరుగుతున్న రక్షణ బడ్జెట్ను ఈ విధానాలు కార్పోరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడానికి ఉపయోగపడతాయి తప్ప దేశ రక్షణ వ్యవహారాల్లో ప్రైవేటు సంస్థల, బహుళ జాతి సంస్థల జోక్యం వల్ల దేశ సార్వభౌమత్వానికే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐడీ ఎఫ్ జాయింట్ సెక్రటరీ జీటీ గోపాల్రావు మాట్లా డుతూ 4 లక్షల మంది రక్షణ శాఖ మంది రక్షణ రంగాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో 23 నుండి 25 జనవరి వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు, ఈ సమ్మెకు ఏఐడీఈఎఫ్, బీపీఎంఎస్, ఐఎన్డీడబ్లూఎఫ్ మూడు ఫెడరేషన్లు స్ట్రగుల్డ్ కమిటీ పేరిట ప్రభు త్వానికి ఎన్ని విన్నతులు చేసినా ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించలేదని, 275 వివిధ రకాల రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్ట రీలకు ఆర్డర్ ఇవ్వకుండా నాన్కోర్ పేరిట ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయడం ఈ సంస్థలను నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ వైఖరిని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఆర్డీఓ రూపొందించిన రెండు లక్షల యాభై వేల కోట్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు మరియు రక్షణ ప్రభుత్వ రంగ పరిశ్ర మలైన హెచ్ఏల్, బీడీఎల్, భీహెచ్ఈఎల్లకు ఇవ్వ కుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర సమాఖ్య ప్రధానకార్యదర్శి అజీజ్ కేంద్ర ప్రభుత్వం 2004 నుండి బలవంతంగా రుద్దబడ్డ నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ గేట్ మీటింగ్కు డీఆర్డీఎల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సురేశ్బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఏఐడిఈఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి చంద్రయ్య, ఏఐటియూసీ రాష్ట్ర కార్యదర్శి బోస్, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని మద్ధతిచ్చారు.