Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉప్పల్
గోవాలోని పానాజీలో ఈ నెల 17 నుంచి 20 వరకు నిర్వహించిన అంతర్జాతీయ బీచ్ కంబాట్ కుంగ్ఫూ పోటీల్లో ఉప్పల్ ర్యాంకర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దేవరాజ్ దీక్షిత్ అండర్-14 కేటగిరిలో స్పైరింగ్లో సిల్వర్ మెడల్ సాధించాడు. దీక్షిత్ను బుధ వారం ర్యాంకర్ పాఠశాల చైర్మెన్ రామానాయుడు విద్యార్థితో పాటు కోచ్ను ఘనంగా సన్మానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు, క్రీడల్లో రాణించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయు లకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. మరికొన్ని విజయాలు సాధించి, సత్తాచాటాలని ఆయన సూచిం చారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ చైర్మెన్ సుబ్రమ ణ్యం, ప్రిన్సిపాల్ రజిత, తదితరులు పాల్గొన్నారు.