Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
2018-19 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ గేమ్స్ ఫెడరే షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెజిలింగ్, సైక్లింగ్ పోటీల్లో వారాసిగూడ నేతాజీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రాణించారు. ఈ పోటీలు ఈ నెల 19న ఆదిలాబాద్, మెదక్లలో నిర్వహించారు. 60కేజీల విభాగంలో పదోతరగతికి చెందిన అభిలాష్ మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 40కేజీల విభాగంలో తొమ్మిదోతరగతికి చెందిన కృష్ణప్రసాద్ మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసు కున్నాడు. 55కేజీల విభాగంలో పదోతరగతికి చెందిన రమావత్ రమేష్ మూడో స్థానం సాధించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. కరాటే విభాగం లో పదోతరగతికి చెందిన మౌనిక ప్రథమస్థానం సాధించి బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల వ్యవస్థాపకుడు కోట్ల నిరంజన్ రెడ్డి విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమం లో క్రీడాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.