Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సికింద్రాబాద్
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుట్టి వెల్లోడి సీతాఫల్మండిలో ఈవినింగ్ క్లీనిక్ మంగళవారం ప్రారంభించారు. స్పెషలిస్ట్ క్లీనిక్లో డాక్టరు సందీప్ జనరల్ ఫిజిషియన్గాసేవలు అందించనున్నారు. క్లీనిక్ లక్ష్యం మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు, థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు, నాన్ కమ్యూనికబుల్ తదితర వ్యాధులకు స్పెషలిస్టు వైద్యం అందించడమే. ఈ కార్యక్రమానికి సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ, ఎస్పీహెచ్ఓ డాక్టరు సక్కుబాయి, అడిషనల్ డీఎం, హెచ్ఓ డాక్టరు సరళ కుట్టివెల్లొడి మెడికల్ ఆఫీసర్ డాక్టరు సంధ్యరాణి, ఆశాజ్యోతి, శ్రీమన్నారాయణ ఇతర పారా మెడికల్ స్టాఫ్ , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.