Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని దళిత నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మేడ్చల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కోర్సులు సహా ఉచిత వసతి భోజన సదుపాయాలను నిరుద్యోగులకు కల్పించనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి నెలలో జరిగే శిక్షణ కార్యక్రమం కాప్రా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల వ్యక్తులు ఉండాలని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ మండల పరిషత్ అభివద్ధి అధికారి మేడ్చల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ఫిబ్రవరి5 వరకు గడువు ఉందని చెప్పారు. ఇతర వివరాలకు 9440380016, 9849532030 నెంబర్లను సంప్రదించాలన్నారు.