Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ముదిరాజ్ సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్ను ఆ సంఘం ప్రతినిధులు మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ... ముదిరాజ్లను బీసీ 'డి' గ్రూపు నుంచి బీసీ 'ఎ'లోకి చేర్చుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. గ్రామాలలో కావలికార్గా పని చేసే వారికి పోలీస్ ఉద్యోగాలలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అటవీ ఉత్పత్తులపై ముదిరాజ్లకు ప్రత్యేక రాయితీ ఇవ్వాలని కోరారు. ముదిరాజ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డొప్ప అంజయ్య ముదిరాజ్, కార్యదర్శి కావలి అనంతయ్య, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర నాయకులు పడకంటి బ్రహ్మచారి, పి.మురళీకృష్ణ, ముత్యాల కేశవులు పాల్గొన్నారు.