Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్
నవతెలంగాణ- ముషీరాబాద్
విద్యార్థులు ఇష్టంతో చదివితేనే విజయం సాధిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం కవాడిగూడ ప్రభుత్వ పాఠశాలలో నరేంద్ర మోడీ రచించిన ఎగ్జామ్ వారియర్ అనే పుస్తకాలను పదో తరగతి విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... చదువును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ పాడవుతుందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ రాం, వెంకటేష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.